
కరీంనగర్ క్రైమ్, వెలుగు: ఆన్లైన్లో పెట్టుబడి పేరుతో రూ.92 లక్షలు మోసం చేసిన కేసులో కరీంనగర్ సైబర్ క్రైం పోలీసులు మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కరీంనగర్ పట్టణానికి చెందిన ఇద్దరి వద్ద గతేడాది జూలై, నవంబర్లలో మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రసాద్ సురేశ్ గువహానే, చందన్ విఠల్ గువహానే, ఉస్మానాబాద్కు చెందిన శ్రేయాస్ ముకుంద్ కోలి.. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, పార్ట్టైం ఉద్యోగాల పేరిట బాధితుల నుంచి రూ.92 లక్షలు పలు దఫాలుగా వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకూ కేసు నమోదు చేసిన సైబర్ పోలీసులు రెండు రోజుల కింద మహారాష్ట్రకు వెళ్లి నిందితులను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. శుక్రవారం కరీంనగర్ కోర్టులో హాజరుపరచగా జైలుకు తరలించినట్లు సైబర్క్రైం డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపారు.